Fire Accident: మ‌హారాష్ట్ర‌లో ఆసుప‌త్రి ఐసీయూలో ఘోర అగ్నిప్ర‌మాదం.. 10 మంది మృతి

fire accident in maharastra hospital

  • అహ్మద్‌నగర్ జిల్లా ఆసుప‌త్రిలో ప్ర‌మాదం
  • గాయ‌ప‌డ్డ‌ ఏడుగురికి మందికి చికిత్స‌
  • మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం

మహరాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా ఆసుప‌త్రిలో ఘోర అగ్ని ప్ర‌మాదం సంభవించింది. ఈ ప్ర‌మాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాల‌య్యాయి. మృతి చెందిన వారు అంద‌రూ క‌రోనా రోగులేన‌ని అధికారులు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్ర‌మాదం జ‌రిగిన వార్డుల్లో మొత్తం 17 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నార‌ని అధికారులు చెప్పారు. గాయాల‌పాలైన ఏడుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ప్రమాదంలో గాయపడినవారికి ప్ర‌స్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News