Telangana: తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసుల నమోదు

Media Bulletin on status of positive cases in Telangana

  • రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు కరోనాతో మృతి
  • జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసుల నమోదు
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,953

తెలంగాణలో గత 24 గంటల్లో 156 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 53 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 12 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 135 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,71,946కి చేరింది. మృతుల సంఖ్య 3,960కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,953 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


  • Loading...

More Telugu News