Pakistan: ఇండియాతో హై ఓల్టేజ్ మ్యాచ్.. 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన పాకిస్థాన్

Pakistan announces team to play against India

  • జట్టుకు నాయకత్వం వహించనున్న బాబర్ ఆజమ్
  • ఇంకా టీమ్ ను ప్రకటించని టీమిండియా
  • టీ20 ప్రపంచకప్ లో ఇప్పటి వరకు ఐదు సార్లు తలపడిన దాయాదులు

టీ20 ప్రపంచకప్ లో భాగంగా రేపు హై ఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. దాయాది దేశాలైన ఇండియా, పాకిస్థాన్ లు తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందే పాకిస్థాన్ 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
 
పాక్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అసిఫ్ ఆలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ.

మరోవైపు టీమిండియా జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి లేదా అశ్విన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యా ఫిట్ గా లేకపోవడం అతడికి అవకాశాలను క్లిష్టం చేసింది. టీ20 ప్రపంచకప్ లో ఇప్పటి వరకు భారత్, పాక్ లు ఐదు సార్లు తలపడగా... ఐదు సార్లూ టీమిండియానే విజయం సాధించింది.

  • Loading...

More Telugu News