Kerala: కేరళలో వర్ష విలయం... 19 మంది మృతి
![Kerala rains gets worsen in some dictricts](https://imgd.ap7am.com/thumbnail/cr-20211017tn616c002c8c6fb.jpg)
- కేరళలో అతి భారీ వర్షాలు
- పలు జిల్లాలు అతలాకుతలం
- విరిగిపడుతున్న కొండచరియలు
- పలు ప్రాంతాల్లో వరద పరిస్థితులు
- సీఎం విజయన్ ఉన్నతస్థాయి సమావేశం
కేరళలో నిన్నటి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా, మరికొన్ని ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య 19కి చేరింది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో వర్ష బీభత్సం అధికంగా ఉంది. ఒక్క కొట్టాయం జిల్లాలోనే 9 మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది.
![](https://img.ap7am.com/froala-uploads/20211017fr616bffdc48cc9.jpg)
గత రాత్రంతా కురిసిన వర్షం ఉదయానికి తగ్గుముఖం పట్టినా, అప్పటికే అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది.