Huzurabad: ఈ నెల 30 వరకు హుజూరాబాద్ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Ban on Huzurabad by poll Exit Polls

  • ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
  • ఆ రోజు సాయంత్రం ఏడున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం
  • అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న ఎన్నికల అధికారి

ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్‌ అసెంబ్లీ నియోజక వర్గానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుండగా, ఆరోజు రాత్రి ఏడున్నర గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వరాదని, ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. ఆదేశాలు అతిక్రమించి, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినా, మీడియాలో ప్రచురించినా శిక్ష తప్పదని కర్ణన్ హెచ్చరించారు.

Huzurabad
Karimnagar District
By Poll
Exit Polls
  • Loading...

More Telugu News