ipl: మ్యాచ్ ఓడిపోవ‌డంతో క‌న్నీరు పెట్టుకున్న రిష‌భ్ పంత్‌, పృథ్వీ షా

pridvi beaks down

  • కోల్‌కతా చేతిలో ఓడిన‌ ఢిల్లీ కేపిటల్స్
  • వెంట‌నే కెప్టెన్ రిష‌భ్‌ పంత్ భావోద్వేగం
  • డ్రెస్సింగ్ రూమ్‌లోనూ క‌న్నీరు
  • మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన పృథ్వీ షా

ఐపీఎల్‌లో భాగంగా షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన వెంట‌నే ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిష‌భ్ పంత్‌, ఓపెన‌ర్ పృథ్వీ షా భావోద్వేగానికి గురై క‌న్నీరు పెట్టుకున్నారు. ఓడిపోయామ‌ని తెలియ‌గానే పృథ్వీ షాలో గ్రౌండ్‌లోనే నిరాశ క‌న‌ప‌డింది. అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న్నీరు పెట్టుకున్నాడు.

మ్యాచ్ ముగిసిన అనంత‌రం కెప్టెన్ రిష‌భ్ పంత్ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యాడు. ఓడిపోయామ‌ని, ఇప్పుడేమీ చేయ‌లేమంటూ వ్యాఖ్య‌లు చేశాడు. తాము మ్యాచ్‌పై ప‌ట్టు స‌డ‌లించ‌లేదని, కోల్‌క‌తా బాగా బౌలింగ్ చేసిందని చెప్పాడు. మ్యాచ్‌లో తాము మ‌ధ్య ఓవ‌ర్ల‌లో త‌డ‌బడ్డామ‌ని తెలిపాడు.

  • Loading...

More Telugu News