Telangana: తెలంగాణలో మరో 190 మందికి కరోనా పాజిటివ్

Telangana corona report

  • గత 24 గంటల్లో 42,166 కరోనా పరీక్షలు
  • మరోసారి 200కి దిగువన పాజిటివ్ కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 245 మంది
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి

తెలంగాణలో కరోనా వ్యాప్తి కనిష్ఠ స్థాయికి చేరుకుంది. మరోసారి 200కి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 42,166 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో 245 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,67,725 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇంకా 4,288 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,929కి పెరిగింది.

Telangana
Corona Virus
Media Report
New Cases
  • Loading...

More Telugu News