Corona Virus: ఏపీలో కొత్తగా 800 మందికి కరోనా పాజిటివ్

Corona positive for 800 new people in AP

  • గత 24 గంటల్లో 46,558 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరిలో 126 కేసులు
  • శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
  • ఇంకా 8,754 మందికి చికిత్స

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,558 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 800 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 126 కరోనా కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111 కేసులు గుర్తించారు. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటిదాకా 14,228 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో నేటివరకు 20,54,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,31,681 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,754 మంది చికిత్స పొందుతున్నారు.
 
.

  • Loading...

More Telugu News