Nagababu: సిద్ధాంతాలు వేరైనా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సోదరులను వదులుకోను: నాగబాబు

I dont Leave Them Till My Last Breath says Naga Babu

  • జీవితాంతం నా సోదరులతోనే కలిసి ఉంటా
  • ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నాగబాబు బదులు
  • బలహీనుడివని విమర్శిస్తే వాదించబోనని పోస్ట్

తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తన అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ లను వదిలిపెట్టబోనని, తుదిశ్వాస వరకు వారితోనే ఉంటానని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. సిద్ధాంతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ తామంతా ఒకటేనన్నారు. బుధవారం ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వ్యంగ్య సమాధానాలు చెప్పిన ఆయన.. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకూ అదే రీతిలో సమాధానమిచ్చారు.

రాజకీయాలంటే ఆసక్తి లేనప్పుడు.. ప్రజలకు ఎలా సేవ చేస్తారని ఆ నెటిజన్ ప్రశ్నించాడు. దీంతో స్పందించిన ఆయన.. అంటే రాజకీయాల్లో ఉంటేనే ప్రజలకు సేవ చేయాలా? అని ఎదురు ప్రశ్నించారు. ‘‘అరెరె.. ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ తప్పు చేశానే. పెద్ద సమస్యే. అవన్నీ పక్కనపెడితే నేను కష్టాల్లో ఉన్న వారికి చేతనైనంత సాయం చేస్తాను. నా సోదరులతోనే ఎప్పుడూ ఉంటాను’’ అని రిప్లై ఇచ్చారు. మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు 'మంది ముందు మాట్లాడే వాడు పులి.. మంది వెనుక మాట్లాడేవాడు పిల్లి' అని జవాబిచ్చాడు.

మరోవైపు ఇంకో పోస్ట్ ను కూడా ఆయన పెట్టారు. ‘‘నేను బలహీనుడనని నువ్వంటే.. బలవంతుడనని చెప్పి నా టైమ్ ను వృథా చేసుకోను. మరింత దృఢంగా మారి అసమాన శిఖరాగ్రాలను అధిరోహించి నువ్వు తప్పని నిరూపిస్తా’’ అంటూ ఓ పోస్ట్ ను పెట్టారు.    

  • Loading...

More Telugu News