Hyderabad: హైద‌రాబాద్‌లో క‌ల‌కలం.. స్కూలుకు వెళ్లిన ఏడో త‌ర‌గ‌తి బాలిక అదృశ్యం

minor girl missing case in hyderabad

  • ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘ‌ట‌న‌
  • పోలీసుల‌కు పాఠ‌శాల హెచ్ఎం ఫిర్యాదు
  • నిన్నటి నుంచి క‌న‌ప‌డ‌ని బాలిక‌

హైద‌రాబాద్‌లోని ఎస్సార్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ బాలిక అదృశ్యం కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. నగ‌రంలోని యూసుఫ్‌గూడ స్టేట్‌ హోంలోని బాలసదనంలో ఉండే ఓ బాలిక (12) అదృశ్య‌మైంద‌ని వివ‌రించారు. ఆమె వెంగళరావు నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతోందని తెలిపారు.

నిన్న‌ ఉదయం స్కూలుకు వెళ్లిన బాలిక‌ మధ్యాహ్నం లంచ్  విరామ సమయంలో అదృశ్య‌మైంద‌ని పోలీసులు చెప్పారు. ఈ విష‌యం గుర్తించిన పాఠ‌శాల సిబ్బంది ఆమె ఆచూకీ కోసం వివిధ ప్రాంతాల్లో వెతికార‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ఆమె క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో ఆ పాఠశాల ప్ర‌ధానోపాధ్యాయుడు ధనుంజయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News