Telangana: తెలంగాణలో తాజాగా 249 మందికి కరోనా

Telangana covid cases updates

  • గత 24 గంటల్లో 53,789 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 82 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 5,258 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 53,789 కరోనా పరీక్షలు నిర్వహించగా, 249 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 313 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,551 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,398 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,258 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,895కి పెరిగింది.

Telangana
COVID19
Positive Cases
Corona Deaths
Daily Cases
Today Cases
  • Loading...

More Telugu News