Team India: నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు... టీమిండియా 78 ఆలౌట్

Team India collapsed in Headingley test

  • భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • సమష్టిగా సత్తా చాటిన ఇంగ్లండ్ పేసర్లు
  • ఆండర్సన్, ఒవెర్టన్ లకు మూడేసి వికెట్లు
  • చెరో రెండు వికెట్లు తీసిన కరన్, రాబిన్సన్

ఇంగ్లండ్ తో మూడో టెస్టు మ్యాచ్ లో టీమిండియా స్వల్ప స్కోరుకు కుప్పకూలింది. హెడింగ్లేలో ఇంగ్లండ్ పేసర్లు చెలరేగడంతో కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ 19, రహానే 18 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్ మెన్ లో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను అవుట్ చేయడం ద్వారా ఆండర్సన్ టీమిండియా పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆపై పుజారా, కోహ్లీలను కూడా పెవిలియన్ చేర్చిన ఈ సీనియర్ బౌలర్ భారత టాపార్డర్ ను కకావికలం చేశాడు. ఆండర్సన్ కు 3 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఓల్లీ రాబిన్సన్ (2), శామ్ కరన్ (2), క్రెగ్ ఒవెర్టన్ (3) కూడా స్వింగ్ బౌలింగ్ తో భారత బ్యాటింగ్ లైనప్ ను హడలెత్తించారు. దాంతో భారత్ కు కనీసం 100 పరుగుల మార్కు చేరే అవకాశం కూడా దక్కలేదు.

Team India
England
Headingley
Third Test
  • Loading...

More Telugu News