India: ఆఫ్ఘ‌న్ నుంచి 85 మంది భారతీయులతో బ‌య‌లుదేరిన మరో విమానం

indian plane lands in tajakistan

  • కాబూల్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు
  • ఇప్ప‌టికే భార‌త్ చేరుకున్న ప‌లువురు
  • ఇంకొంత మందిని తీసుకొచ్చేందుకు వెళ్లిన విమానం

ఆఫ్ఘ‌నిస్థాన్‌లో తాలిబ‌న్లు రెచ్చిపోతుండ‌డంతో భార‌తీయులను అక్క‌డి నుంచి తీసుకురావ‌డానికి భార‌త్ చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కొంద‌రిని భారత్‌కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు భార‌త‌ వైమానిక ద‌ళానికి చెందిన సీ-130జే విమానంలో 85 మంది భార‌తీయులు కాబూల్ నుంచి బ‌య‌లుదేరారు.

అక్క‌డి నుంచి బ‌య‌లుదేరిన అనంత‌రం ఆ విమానం ఇంధ‌నాన్ని నింపుకోవ‌డం కోసం త‌జ‌కిస్థాన్‌లో దిగింది. కాసేప‌ట్లో అక్క‌డి నుంచి తిరిగి ఆ విమానం బ‌య‌లుదేర‌నుంది. అంతేగాక‌, అక్క‌డే  మ‌రో విమానాన్ని కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. ఏ కార‌ణంతోనైనా మొద‌టి విమానంలో భార‌తీయుల‌ను తీసుకెళ్లేందుకు వీలులేక‌పోతే రెండో విమానంలో తీసుకొస్తారు.

  • Loading...

More Telugu News