Telangana: తెలంగాణలో మరో 405 మందికి కరోనా పాజిటివ్

Telangana covid cases details

  • గత 24 గంటల్లో 84,262 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 67 కేసులు
  • తాజాగా ముగ్గురి మృతి
  • ఇంకా 7,093 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 84,262 కరోనా పరీక్షలు నిర్వహించగా, 405 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 67 కొత్త కేసులు నమోదు కాగా, వరంగల్ అర్బన్ జిల్లాలో 36, కరీంనగర్ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 577 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,52,785 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,41,847 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 7,093 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,845కి చేరింది.

Telangana
Corona Virus
Positive Cases
Deaths
  • Loading...

More Telugu News