Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

Media Bulletin on status of positive cases COVID19 in india

  • నిన్న  43,071  క‌రోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433
  • మృతుల సంఖ్య మొత్తం 4,02,005 
  • 41,82,54,953 కరోనా పరీక్షలు  

దేశంలో నిన్న  43,071  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 52,299 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,45,433కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 955 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం  4,02,005కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,58,078 మంది కోలుకున్నారు. 4,85,350 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,12,21,306 వ్యాక్సిన్ డోసులు వేశారు.  
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 41,82,54,953 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,38,490 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News