Chandrababu: 'సాధన దీక్ష' పేరుతో రేపు టీడీపీ ఆందోళనలు

TDP to take up Sadhana deeksha tomorrow

  • కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో దీక్ష
  • అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో దీక్ష చేపట్టనున్న చంద్రబాబు
  • ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష

కరోనా బాధితులను ఆదుకోవాలనే డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది. 'సాధన దీక్ష' పేరుతో రేపు ఏపీ వ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టబోతోంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో ఆయనతో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు.

మరోవైపు చంద్రబాబు మాట్లాడుతూ, అమరావతిని దక్షిణ భారతదేశ విద్యాకేంద్రంగా మార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని... ఆ విజన్ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని చెప్పారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందారని అన్నారు. చదువు పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు ఏడాదికి రూ. 50 లక్షల వేతనం వచ్చే ఉద్యోగాలను పొందారని చెప్పారు.

Chandrababu
Telugudesam
Sadhana Deeksha
  • Loading...

More Telugu News