Corona Virus: దేశంలో కొత్త‌గా 84,332 క‌రోనా కేసులు

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,59,155
  • నిన్న‌ 4,002 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 3,67,081
  • 24,96,00,304 మందికి వ్యాక్సిన్లు  

దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న 84,332 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,21,311 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,93,59,155కు చేరింది. మరో 4,002 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,67,081కు పెరిగింది.

 ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,79,11,384 మంది కోలుకున్నారు. 10,80,690 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24,96,00,304 మందికి వ్యాక్సిన్లు వేశారు.

  • Loading...

More Telugu News