Corona Virus: ఏపీలో కరోనా బీభత్సం... 10 వేలు దాటిన మరణాల సంఖ్య

Corona deaths raise in AP

  • 24 గంటల్లో రాష్ట్రంలో 118 మంది మృతి
  • 10,022కి చేరిన మొత్తం మరణాల సంఖ్య
  • తాజాగా 19,981 మందికి పాజిటివ్
  • 18,336 మందికి కరోనా నయం
  • ఇంకా 2,10,683 మందికి చికిత్స

ఏపీలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్నిరోజుల మాదిరే, గడచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో 118 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 15 మంది, చిత్తూరు జిల్లాలో 14 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 10 వేలు దాటింది. తాజా మరణాలతో కలిపి 10,022గా నమోదైంది.

ఇక రోజువారీ కేసుల విషయానికొస్తే... 90,609 కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి 3 వేలకు పైన కొత్త కేసులు వెల్లడయ్యాయి. ఇతర జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో తాజాగా 18,336 మంది కోలుకున్నారు. ఇంకా 2,10,683 మందికి చికిత్స కొనసాగుతోంది.

ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. 13,41,355 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.

Corona Virus
Deaths
Andhra Pradesh
New Cases
Second Wave
  • Loading...

More Telugu News