Andhra Pradesh: ఏపీలో కొత్తగా 14,792 పాజిటివ్ కేసులు, 57 మరణాలు

Andhra Pradesh corona details

  • గత 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 1,831 పాజిటివ్ కేసులు
  • పలు జిల్లాల్లో వెయ్యికిపై కొత్త కేసులు
  • 1,14,158కి పెరిగిన యాక్టివ్ కేసుల సంఖ్య

ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,831 కొత్త కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 8,188 మంది కరోనా నుంచి కోలుకోగా, 57 మంది మరణించారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Details
New Cases
Today
Deaths
Positive Cases
  • Loading...

More Telugu News