Corona Virus: దేశంలో ఒక్క‌రోజులో మూడున్న‌ర ల‌క్ష‌ల మందికి క‌రోనా

Media Bulletin on status of positive cases COVID19 in india

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172
  • మృతుల సంఖ్య 1,92,311
  • 14,09,16,417  మందికి వ్యాక్సిన్లు
  • 27,79,18,810 కరోనా పరీక్షలు    

భార‌త్‌లో క‌రోనా ఉద్ధృతి ఉగ్ర‌ రూపం దాల్చింది. నిన్న‌ కొత్త‌గా 3,49,691 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,17,113 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,767 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,92,311కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,40,85,110 మంది కోలుకున్నారు. 26,82,751 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 14,09,16,417 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,79,18,810 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,19,588 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News