Corona Virus: దేశంలో కొత్త‌గా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ

India reports 346786 new  COVID19 cases

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,66,10,481
  • మృతుల సంఖ్య 1,89,544
  • 13,83,79,832  మందికి వ్యాక్సిన్లు  
  • 27,61,99,222 కరోనా పరీక్షలు

దేశంలో క‌రోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చింది. నిన్న‌ కొత్త‌గా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,66,10,481 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 2,624 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,89,544 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. 25,52,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,83,79,832  మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 27,61,99,222 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 17,53,569 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News