Corona Virus: తెలంగాణలో కొత్త‌గా 3,840 మందికి కరోనా పాజిటివ్

Media Bulletin on status of positive cases  COVID19 in Telangana

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,885
  • మృతుల సంఖ్య  1,797
  • యాక్టివ్ కేసులు 30,494
  • జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 505 కేసులు  

తెలంగాణలో క‌రోనా కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 3,840 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,198 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,885కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,09,594 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,797గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 30,494 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 20,215 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 505 మందికి క‌రోనా సోకింది.  

  • Loading...

More Telugu News