West Bengal: బైక్‌పై వచ్చి నందిగ్రామ్‌లో ఓటేసిన సువేందు అధికారి

Suvendu Adhikari Casted his Vote

  • నందిగ్రామ్‌లో జోరుగా పోలింగ్
  • రెండో విడతలో 30 స్థానాలకు పోలింగ్
  • బరిలో 171 మంది అభ్యర్థులు
  • అసోంలో 39 స్థానాలకు పోలింగ్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా నేడు రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మొత్తం 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా 171 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తన ప్రత్యర్థి అయిన బీజేపీ నేత సువేందు అధికారి ముఖాముఖి తలపడుతున్న నందిగ్రామ్‌లోనూ నేడే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఇక్కడే కేంద్రీకృతమై ఉంది.

బీజేపీ అభ్యర్థి సువేందు ఈ ఉదయమే ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బైక్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకున్న సువేందు బూత్ నంబరు 76లో తన ఓటు వేశారు. మరోవైపు, అసోంలోనూ రెండో విడత ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం మొదలైంది. 14 జిల్లాల్లోని 39 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గత నెల 27న ఇక్కడ జరిగిన తొలి విడత పోలింగులో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం గమనార్హం.

West Bengal
Nandi Gram
Suvendu Adhikari
Assam
  • Loading...

More Telugu News