Corona Virus: దేశంలో కొత్త‌గా 68,020 మందికి కరోనా నిర్ధారణ

India reports 68020 new COVID19 cases

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644
  • మృతుల సంఖ్య 1,61,843
  • 6,05,30,435 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 24,18,64,161 కరోనా పరీక్షలు  

దేశంలో క‌రోనా  కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గ‌త 24 గంటల్లో 68,020 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 32,231 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,644కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 291 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,61,843కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,13,55,993 మంది కోలుకున్నారు. 5,21,808 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 6,05,30,435 మందికి వ్యాక్సిన్లు వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,18,64,161 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,13,319 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News