Corona Virus: దేశంలో మ‌ళ్లీ 35 వేలు దాటిన కొత్త క‌రోనా కేసులు

India reports 35871 new COVID19 cases

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,74,605
  • మృతుల సంఖ్య 1,59,216
  • దేశవ్యాప్తంగా 3,71,43,255 మందికి వ్యాక్సిన్లు
  • మొత్తం 23,03,13,163 కరోనా పరీక్షలు  

దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ భారీగా పెరిగిపోతున్నాయి. మొన్న‌ క‌రోనా కేసుల సంఖ్య 28,903గా న‌మోదు కాగా, గ‌త‌ 24 గంట‌ల్లో 35,871 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 17,741 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,74,605కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 172 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,59,216 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,10,63,025 మంది కోలుకున్నారు. 2,52,364 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 3,71,43,255 మందికి వ్యాక్సిన్లు వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 23,03,13,163 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,63,379 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News