Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు!

India reports 12194 new COVID19 cases

  • 24 గంటల్లో 12,194 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940
  • మృతుల సంఖ్య 1,55,642
  • ఇప్ప‌టివ‌ర‌కు 82,63,858 మందికి వ్యాక్సిన్      

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,194 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,106 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,09,04,940 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 92  మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,55,642 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,06,11,731 మంది కోలుకున్నారు. 1,37,567 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 82,63,858 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,62,30,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,97,114 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News