Vijayasai Reddy: చంద్రబాబు పిచ్చిముదిరి జో బైడెన్, పుతిన్ కు కూడా లేఖలు రాస్తాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy satires in Chandrababu

  • చంద్రబాబుపై విజయసాయి వ్యాఖ్యలు
  • రాష్ట్రపతి, హోంమంత్రికి లేఖలు రాశాడు 
  • అమెరికా సైన్యాన్ని దింపాలని కోరతాడని వ్యంగ్యం
  • ప్రజలే ఓడిపోయారని తృప్తిపడతాడంటూ ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబు తాజా పరిస్థితుల నేపథ్యంలో లేఖలు రాస్తుండడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. చంద్రబాబు రాష్ట్రపతికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాశాడని, పిచ్చిముదిరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రష్యా దేశాధినేత పుతిన్ లకు కూడా ఉత్తరాలు రాస్తాడని ఎద్దేవా చేశారు. ఈసారి కేంద్ర బలగాలు కాదు, అమెరికా సైన్యం, ఐక్యరాజ్యసమితి శాంతిదళం పంపాలని కోరతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. చివరికి చిత్తుగా ఓడింది టీడీపీ కాదు... ప్రజలే ఓడిపోయారంటూ తృప్తిపడతాడని విజయసాయి ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

Vijayasai Reddy
Chandrababu
Letters
Joe Biden
Putin
UNO
  • Loading...

More Telugu News