sarmila: లోటస్‌ పాండ్‌లో ష‌ర్మిల ఫ్లెక్సీలు.. ఆస‌క్తిక‌ర నినాదాలు.. ఫొటోలు ఇవిగో

flexis at lotus pond

  • కాసేపట్లో ఆత్మీయ సమావేశం
  • వైఎస్సార్‌ అభిమానుల కోలాహ‌లం
  • మన బ‌తుకులు మార్చే బాట వైఎస్సార్ కుటుంబానికి తెలుసని నినాదాలు
  • షర్మిలమ్మ నాయకత్వం వ‌ర్థిల్లాల‌ని ఫ్లెక్సీలు
  • జనరంజక పాలన ముందుందిక అంటూ నినాదాలు

దివంగత వైఎస్సార్ కూతురు షర్మిల హైద‌రాబాద్‌, లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో కాసేపట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న నేప‌థ్యంలో అక్క‌డ  వైఎస్సార్‌ అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది. అక్క‌డ పోస్ట‌ర్లు వెలిశాయి.
                
మన కష్టం తెలుసని, మన కన్నీళ్లు తెలుసని, మన బ‌తుకులు మార్చే బాట అని అందులో పేర్కొన్నారు. ఆ బాట ఏంటో వైఎస్సార్ కుటుంబానికి తెలుసని, షర్మిలమ్మ నాయకత్వం వ‌ర్థిల్లాల‌ని ఫ్లెక్సీల్లో ఉంది. అయితే, ఈ ఫ్లెక్సీలలో వైఎస్సార్, షర్మిల ఫొటోలు మాత్రమే ఉన్నాయి.
     
   
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఫొటో లేదు. జనంలోకి షర్మిలక్క వ‌స్తున్నార‌ని, జనరంజకపాలన ముందుందిక అంటూ ప‌లు ఫ్లెక్సీలు ఏర్పాటు కావ‌డం ఆసక్తిక‌రంగా మారింది. వైఎస్ అభిమానులు అక్క‌డ‌కు చేరుకుంటున్నారు.
             
గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలను స‌మావేశానికి రావాల‌ని  షర్మిల ఇప్ప‌టికే ఆహ్వానించారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ  సమావేశంలో కొత్త పార్టీపై కార్యకర్తలతో షర్మిల చ‌ర్చించ‌నున్న‌ట్లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఒకవేళ కొత్త పార్టీ కాకుంటే, ష‌ర్మిల నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లోనూ వైసీపీ ముందుకు వెళ్తుంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 దీనిపై ఈ రోజు స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.  షర్మిల పార్టీ పెడ‌దామ‌ని సూచిస్తే త్వరలోనే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అధికారికంగా పార్టీ పేరు ప్ర‌క‌టిస్తామ‌ని అభిమానులు అంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా ష‌ర్మిల‌ సమావేశాలు జ‌రుపుతార‌ని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News