Venkatesh Daggubati: ఫ్యామిలీ హీరోలు కలసి నటించే సినిమా!

Ramanaidu Family heroes film on cards

  • అక్కినేని హీరోలతో వచ్చిన 'మనం'కు ఆదరణ 
  • రామానాయుడి కుటుంబ హీరోలతో సినిమా
  • ఇందులో నాగ చైతన్య కూడా ఒక హీరో   
  • కథ సిద్ధం చేసిన దర్శకుడు సతీశ్ వేగేశ్న   

ఆమధ్య అక్కినేని వారి కుటుంబంలోని హీరోలంతా కలసి 'మనం' సినిమాలో నటించారు. చక్కని కథతో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే కోవలో ఇప్పుడు ప్రముఖ నిర్మాత, దివంగత రామానాయుడు కుటుంబంలోని హీరోలు కలసి ఓ సినిమాలో నటించనున్నారు. ఇందుకు ప్రస్తుతం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

తమ కుటుంబానికి చెందిన హీరోలైన వెంకటేశ్, రానా, నాగ చైతన్యలతో కలసి ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని రామానాయుడు ఎంతగానో కలగన్నారు. అయితే, సరైన కథ లభించక అది ఆయన జీవించి ఉండగా కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈ చిత్రాన్ని నిర్మించే బాధ్యతను ఆయన పెద్ద కొడుకు సురేశ్ బాబు తీసుకున్నారు.

ఈ క్రమంలో ఈ ముగ్గురు హీరోలకూ సరిపడా కథను దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందించినట్టు తెలుస్తోంది. 'శతమానం భవతి' వంటి అవార్డు చిత్రాన్ని రూపొందించిన సతీశ్.. ఇటీవల సురేశ్ బాబుని ఈ విషయంలో సంప్రదించాడట కూడా. ప్రస్తుతం 'కోతికొమ్మచ్చి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సతీశ్, అది పూర్తవగానే ఈ ముగ్గురు హీరోల సినిమాపై దృష్టి పెడతాడట. ఆ కథ ఈ హీరోలకు నచ్చితే కనుక వెంటనే సెట్స్ కి వెళ్లే అవకాశం వుంది.

  • Loading...

More Telugu News