Nara Lokesh: జగన్ పాలనలో మరో గిరిజన యువతి బలైపోయింది: నారా లోకేశ్

Lokesh slams CM jagan in another incident

  • సీఎం జగన్ పై ధ్వజమెత్తిన లోకేశ్
  • పూజారి ప్రియాంక అనే అమ్మాయి చావుబతుకుల్లో ఉందన్న లోకేశ్
  • ప్రేమ పేరుతో మోసపోయిందని వెల్లడి
  • ఆత్మహత్య యత్నం చేసిందని వివరణ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై మరోసారి ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మరో గిరిజన యువతి బలైపోయిందని ఆరోపించారు. బంగారు భవిష్యత్తు ఉన్న పూజారి ప్రియాంక అనే అమ్మాయి రాయచోటిలో వైసీపీ నేతల ఒత్తిడి, కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా చావుబతుకు మధ్య కొట్టుమిట్టాడుతోందని తెలిపారు.

ప్రియాంక ప్రేమ పేరుతో మోసపోయిందని, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తండ్రికి అవమానం ఎదురవడంతో ఆ అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించిందని లోకేశ్ వెల్లడించారు. ప్రియాంకను మోసం చేసిన వ్యక్తి తండ్రి వైసీపీ ఎమ్మెల్యేకి అనుచరుడని, అందుకే ప్రియాంకకు ఈ పరిస్థితి వచ్చిందని వివరించారు.

ప్రభుత్వం ప్రియాంకకు మెరుగైన వైద్యం అందించాలని, ఆమెకు ఇలాంటి దుస్థితి కలగడానికి కారణమైన వైసీపీ నాయకులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News