Pawan Kalyan: డోకిపర్రులో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్!

pawan reaches dokiparru

  • గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా డోకిపర్రుకు పవన్
  • ఆయనతో పాటు నాదెండ్ల మనోహర్
  • డోకిపర్రులో  వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు  

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుడివాడ సమీపంలోని డోకిపర్రు చేరుకున్నారు. ఆ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆయన దర్శించుకుంటున్నారు.

ఆయనతో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన స్థానిక నేతలు, కార్యకర్తలు భారీగా ఆ ఆలయానికి తరలి వస్తున్నారు. డోకిపర్రులో  వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇటీవలే వైభవంగా ప్రారంభయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ స్వామివారిని దర్శించుకుంటున్నారు.
  

  • Loading...

More Telugu News