Corona Virus: దేశంలో మరో 44,878 మందికి సోకిన కరోనా

With 44878 new COVID19 infections Indias total cases surge

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,28,795
  • మృతుల సంఖ్య 1,28,688
  • కోలుకున్న వారు 81,15,580 మంది  

దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,878 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,28,795 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,079 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 547 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,28,688 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 81,15,580 మంది కోలుకున్నారు. 4,84,547 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.              
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 12,31,01,739 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,39,230 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News