Corona Virus: దేశంలో కొత్తగా 38,074 మందికి కరోనా నిర్ధారణ!

38074 new COVID19 infections in India

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731
  • మృతుల సంఖ్య 1,27,059
  • కోలుకున్న వారు 79,59,406 మంది

దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 38,074 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,91,731కి చేరింది. ఇక గత 24 గంటల్లో 42,033 మంది కోలుకున్నారు.

 గడచిన 24 గంట‌ల సమయంలో 448 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,27,059 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 79,59,406 మంది కోలుకున్నారు. 5,05,265 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.          
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,96,15,857 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,43,665 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News