Corona Virus: దేశంలో 85 లక్షలు దాటిన కరోనా కేసుల సంఖ్య

45674 new COVID19 infections in India

  • గత 24 గంటల్లో 45,674 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754
  • మృతుల సంఖ్య 1,26,121
  • కోలుకున్న 78,68,968 మంది  

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,674 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,082 మంది కోలుకున్నారు.

అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 559 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,121 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 78,68,968 మంది కోలుకున్నారు. 5,12,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.      
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,77,36,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,94,487 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News