Nobel Prize: రసాయనశాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలను వరించిన నోబెల్ ప్రైజ్

Two women wins this year Nobel Prize

  • దౌడ్నా, చార్పెంటీర్ లకు కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్
  • జన్యుకత్తెర విధానానికి రూపకల్పన చేసిన శాస్త్రవేత్తలు
  • అత్యంత కచ్చితత్వంతో జన్యుమార్పిడికి అవకాశం

వివిధ శాస్త్ర రంగాల్లో వరుసగా నోబెల్ ప్రైజులు ప్రకటిస్తున్నారు. గత రెండ్రోజులుగా వైద్య, భౌతిక శాస్త్ర రంగాల్లో విజేతలను ప్రకటించిన ద రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా రసాయనశాస్త్రంలో అవార్డుకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది. అమెరికాకు చెందిన జెన్నిఫర్ ఎ దౌడ్నా, ఇమ్మాన్యుయెల్లే చార్పెంటీర్ 2020కి గాను కెమిస్ట్రీలో నోబెల్ విజేతలుగా నిలిచారు. జన్యువులో మార్పులు, చేర్పులు చేసేందుకు వీలుగా వీరు ఓ కొత్త విధానానికి రూపకల్పన చేశారు.  

ఓ జీవి డీఎన్ఏ జన్యుపటాన్ని సవరించడమే కాకుండా, దాన్ని నియంత్రించేందుకు జీనోమ్ ఎడిటింగ్ విధానాన్ని ఆవిష్కరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఓ జీవి డీఎన్ఏను మార్చడం ఇకపై ఎంతో సులువు. అది జంతువైనా, మొక్క అయినా సరే... అత్యంత కచ్చితత్వంతో తాము కోరుకున్న జన్యువును ఎంతమేర మార్చవచ్చో అంతమేర మాత్రమే మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

Nobel Prize
Emmanuelle Charpentier
Jennifer A. Doudna
Chemistry
Genome
  • Loading...

More Telugu News