Jagan: ఢిల్లీకి చేరుకున్న జగన్.. రేపు మోదీతో భేటీ

Jagan reaches Delhi

  • ఇద్దరు ఎంపీలు, 10 మంది బృందంతో ఢిల్లీ చేరుకున్న జగన్
  • నేరుగా ఏపీ భవన్ కు చేరుకున్న సీఎం
  • పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఎంపీలు, 10 మందితో కూడిన బృందం ఢిల్లీకి వెళ్లింది. ప్రత్యేక విమానంలో వీరంతా దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. నదీజలాల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ పాల్గొననున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మరోవైపు, ఎన్డీయేలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ, కేంద్ర మంత్రి పదవులను వైసీపీకి మోదీ ఆఫర్ చేశారనే వార్తల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News