Sensex: ట్రంప్ ఎఫెక్ట్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex closes 277 points higher

  • 277 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 86 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 7 శాతానికి పైగా లాభపడ్డ టీసీఎస్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నారనే వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో పయనించాయి. మన మార్కెట్లపై కూడా దాని ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 38,974కి చేరుకుంది. నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 11,503 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (7.30%), టాటా స్టీల్ (4.71%, సన్ ఫార్మా (3.23%), ఇన్ఫోసిస్ (3.00%), టెక్ మహీంద్రా (2.26%).    

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.70%), బజాజ్ ఫైనాన్స్ (-1.86%), భారతి ఎయిర్ టెల్ (-1.85%), బజాజ్ ఆటో (-1.27%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.15%).

  • Loading...

More Telugu News