Corona Virus: దేశంలో 57 లక్షలు దాటిన కరోనా కేసులు

COVID19 case tally crosses 57lakh mark

  • గత 24 గంటల్లో  86,508 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,32,519
  • మృతుల సంఖ్య మొత్తం 91,149
  • కోలుకున్న వారు 46,74,988 మంది  

దేశంలో కరోనా కేసుల సంఖ్య 57 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 86,508 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 57,32,519కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 1,129 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 91,149కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 46,74,988 మంది కోలుకున్నారు. 9,66,382 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
                    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 6,74,36,031 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,56,569 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News