Corona Virus: దేశంలో క‌రోనా అప్ డేట్స్.. 44,65,864కి చేరిన మొత్తం కేసులు

Single day spike of 95735 new COVID19 cases

  • కొత్త‌గా 95,735 కేసులు
  • కోలుకున్న‌ వారు 34,71,784 మంది
  • 919018 మందికి ఆసుపత్రుల్లో చికిత్స

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఏరోజుకారోజు భారీగా పెరుగుతోంది. ఒక్క రోజులో 90 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 95,735 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన బులెటిన్‌లో పేర్కొంది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది.

 అదే సమయంలో 1,172 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 75,062కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 34,71,784 మంది కోలుకున్నారు. 9,19,018 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                              
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 5,29,34,433 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,29,756  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News