Corona Virus: దేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరిగిపోతోన్న కరోనా కేసులు.. కొత్తగా 77,266 మందికి పాజిటివ్

COVID19 case tally at 3387 lakh with a record spike of 77266 fresh cases

  • మొత్తం కేసులు 33,87,501 
  • మృతుల సంఖ్య మొత్తం 61,529
  • కోలుకున్న వారు 25,83,948 మంది
  • 7,42,023 మందికి ఆసుపత్రుల్లో  చికిత్స  

భారత్‌లో కొవిడ్-19 కేసులు ప్రతిరోజు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. కేవలం ఒక్కరోజులో 75 వేలకు మించి కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 77,266 మందికి కరోనా సోకిందని, అదే సమయంలో 1,057 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
     
దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 33,87,501కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 61,529కు  పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  25,83,948  మంది కోలుకున్నారు. 7,42,023 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.  
                                        
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 3,94,77,848  కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే  9,01,338  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News