Sushant Singh Rajput: గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడు!: హీరో సుశాంత్ గురించి పనిమనిషి

sushant used to take ganjayi

  • కొనసాగుతోన్న సీబీఐ విచారణ
  • సుశాంత్ పనిమనిషి, స్నేహితుడిని ప్రశ్నించిన అధికారులు
  • వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవాడన్న పనిమనిషి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) అధికారుల విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్‌ను తాజాగా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సుశాంత్‌ గురించి ఆయన పలు విషయాలను అధికారులకు తెలిపాడు.

సుశాంత్ పదేపదే గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని సుశాంత్‌ సింగ్ చెప్పాడు. సొంతింట్లోనే ఆయన వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవాడని ఆయన తెలిపాడు. సుశాంత్‌ మృతికి తాను రెండు రోజుల ముందే ఆయనకు గంజాయితో నింపిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని, ఆయన మృతి చెందిన అనంతరం వాటిని చూస్తే పెట్టెలన్నీ ఖాళీగా కనిపించాయని ఆయన చెప్పినట్లు తెలిసింది.

కాగా, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని ముంబైలో సీబీఐ బృందం ఉన్న డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌కు ఈ రోజు ఉదయం వచ్చి పలు వివరాలు వెల్లడించాడు. సుశాంత్ సింగ్ వాడిన ఒక మొబైల్ ఫోన్ నంబర్ సిద్ధార్థ్ పిథాని పేరున ఉన్నట్లు ఇటీవల దర్యాప్తులో అధికారులకు తెలిసింది.

  • Loading...

More Telugu News