Andhra Pradesh: ఏపీలో కొత్తగా 10,276 కరోనా కేసులు, 97 మంది మృతి 

AP witnessed 10276 new cases in 24 cases

  • ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
  • 3,45,216కి పెరిగిన మొత్తం కేసుల సంఖ్య
  • 24 గంటల్లో 8,593 మంది డిశ్చార్జ్

ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో 1321, చిత్తూరులో 1220, పశ్చిమగోదావరిలో 1033, అనంతపురం జిల్లాలో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో, ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 3,45,216కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 97 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 3,189కి పెరిగింది. గత 24 గంటల్లో 61,469 మంది శాంపిల్స్ పరీక్షించారు. మరోవైపు 24 గంటల్లో 8,593 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Andhra Pradesh
Corona Virus
Cases
Deaths
  • Loading...

More Telugu News