Corona Virus: తెలంగాణలో కరోనా విజృంభణ.. లక్ష దాటేసిన కేసులు

coronavirus cases in telangana

  • కొత్తగా 2,474  మందికి కరోనా 
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865
  • ఆసుపత్రుల్లో 22,386 మందికి చికిత్స
  • 78,735 మంది డిశ్చార్జ్  

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 2,474  మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. అదే సమయంలో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,768 మంది కోలుకున్నారు.  

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,865కి చేరింది. ఆసుపత్రుల్లో 22,386 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 78,735 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 744కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 447 మందికి కొత్తగా కరోనా సోకింది.


.

  • Loading...

More Telugu News