Sabari Rever: శబరి నదిలో ప్రమాదం.. రెండు ముక్కలైన లాంచీ.. ముగ్గురి గల్లంతు!

Boat breaks in to two pieces in Sabari rever
  •  తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద ఘటన
  • లాంచీలో ఇతరులు ఎంతమంది ఉన్నారో అనే ఆందోళన
  • ఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది
తూర్పుగోదావరి జిల్లా చింతూరు వద్ద శబరి నదిలో కాసేపటి క్రితం ప్రమాదం సంభవించింది. నదిపై నిర్మించిన బ్రిడ్జ్ పిల్లర్ ను ఢీకొన్న ఓ లాంచీ రెండు ముక్కలైంది. అనంతరం నీటిలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీస్, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. కల్లేరు పంచాయతీకి సరుకులు అందించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ఘటనలో లాంచీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆ సమయంలో లాంచీలో ఇంకెంత మంది ఉన్నారనే విషయంపై ఆందోళన నెలకొంది.  చీకటిగా ఉండటంతో అక్కడి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు. గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంది.
Sabari Rever
Boat
Accident

More Telugu News