Moddu Srinu: జైల్లో మొద్దు శీనును చంపిన ఓంప్రకాశ్ మృతి

Muddu Sreenu murderer Om Prakash dead

  • విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్
  • గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వైనం
  • కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

పరిటాల రవి హత్యకేసు నిందితుడు మొద్దు శీనును హత్య చేసిన ఓంప్రకాష్ మృతి చెందాడు. విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. గత కొంత కాలంగా ఓంప్రకాష్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. 2016 నుంచి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఓంప్రకాశ్ శిక్షను అనుభవిస్తున్నాడు.

2008 నవంబర్ లో అనంతపురం జిల్లా కోర్టులో మొద్దుశీను దారుణ హత్యకు  గురయ్యాడు. తాను రామకోటి రాసుకుంటుండగా... జైలు గదిలోని లైటును మొద్దు శీను ఆర్పేశాడని, ఆ కోపంతోనే అతన్ని హత్య చేసినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఓంప్రకాశ్ తెలిపాడు.

Moddu Srinu
Om Prakash
Dead
  • Loading...

More Telugu News