India: దేశంలో ఒక్క రోజులో 9,996 మందికి కొత్తగా కరోనా

India reports the highest single day spike of 9996

  • మొత్తం కేసులు 2,86,579
  • మృతుల సంఖ్య 8,102
  • 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న 1,41,029 మంది

దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకీ భారీగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,996 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 357  మంది కరోనాతో మరణించారు.  
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,86,579కి చేరగా, మృతుల సంఖ్య 8,102కి చేరుకుంది. 1,37,448 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,41,029 మంది కోలుకున్నారు.

  • Loading...

More Telugu News