Telangana: తెలంగాణలో కరోనా బీభత్సం... ఆరుగురు మృత్యువాత

Six people dies of corona in Telangana

  • రాష్ట్రంలో 148కి చేరిన మృతుల సంఖ్య
  • గత 24 గంటల్లో 178 కొత్త కేసులు వెల్లడి
  • అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 మందికి కరోనా

తెలంగాణలో కరోనా రక్కసి మరణమృదంగం మోగిస్తోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. దాంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 148కి చేరింది. కొత్తగా 178 కరోనా కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 143 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,920కి పెరిగింది. ఇప్పటివరకు 1,742 మంది డిశ్చార్జి కాగా, 2,030 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Virus
Death
Positive
Discharge
  • Loading...

More Telugu News