Andhra Pradesh: ఏపీలో కొత్తగా 147 మందికి కరోనా పాజిటివ్... మరో ఇద్దరి మృతి

Many more corona positive cases surfaced in AP
  • గత 24 గంటల్లో 15,085 నమూనాల పరీక్ష
  • ఏపీలో 3,990కి పెరిగిన కేసులు
  • 77కి చేరిన మరణాలు
ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,085 నమూనాలు పరీక్షించగా, 147 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3,990కి పెరిగింది. తాజాగా మరో రెండు మరణాలు సంభవించాయి. కృష్ణా జిల్లాలో ఒకరు, అనంతపురం జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. తద్వారా మొత్తం కరోనా మృతుల సంఖ్య 77కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 16 మందిని డిశ్చార్జి చేయగా, కోలుకున్నవారి సంఖ్య 2,403కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 1,510 మంది చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh
Corona Virus
Positive
Death
Discharge
COVID-19

More Telugu News