Andhra Pradesh: ఏపీలో మరో 161 మందికి కరోనా పాజిటివ్

AP gets more corona positive cases

  • గత 24 గంటల్లో 12,771 నమూనాల పరీక్ష
  • 3,558కి పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య
  • ఇప్పటివరకు 2,323 మంది డిశ్చార్జి

ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. 12,771 నమూనాలు పరీక్షించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,323 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,192 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మరణాలేవీ సంభవించకపోగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య (73)లో ఎలాంటి మార్పులేదు. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న 29 మందిని డిశ్చార్జి చేశారు.

Andhra Pradesh
Corona Virus
Positive
Discharge
COVID-19
  • Loading...

More Telugu News