Telangana: 40 కొత్త కేసులు, 13 మంది డిశ్చార్జి.. తెలంగాణలో మరింత వ్యాపిస్తున్న కరోనా

Corona spreading continues in Telangana

  • జీహెచ్ఎంసీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • నేడు 33 మందికి కరోనా నిర్ధారణ
  • మరో ఏడుగురు వలస కార్మికులకు వైరస్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింత విస్తరిస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు వెల్లడవుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 40 మందికి కరోనా నిర్ధారణ కాగా, వారిలో 33 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. మిగిలిన ఏడుగురు వలస కార్మికులని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బులెటిన్ లో పేర్కొంది.

ఇక, నేడు 13 మంది డిశ్చార్జి అయ్యారు. దాంతో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 959కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1454 కాగా, ప్రస్తుతం ఆసుపత్రుల్లో 461 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు విడిచారు.

Telangana
Corona Virus
GHMC
Hyderabad
Positive Cases
Active Cases
Discharge
  • Loading...

More Telugu News